ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటితో ముగియనున్న నాంపల్లి ఎగ్జిబిషన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 15, 2018, 08:50 AM

హైదరాబాద్: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) నేటితో ముగియనున్నది. మంగళవారం నాటికి సందర్శకుల సంఖ్య 18 లక్షల వరకు చేరుకున్నది. బుధవారం సందర్శకులు మరింత పెరిగారు. చివరి రోజు దాదాపు లక్ష మంది సందర్శిస్తారని నిర్వాహకులు ఆశిస్తున్నారు. ఈ లెక్కన ఎగ్జిబిషన్ సందర్శకులు ఇరవై లక్షలు దాటే అవకాశాలున్నాయి. గత శనివారం నుంచి ఉదయం 11 గంటల నుంచి సందర్శకులు ఎగ్జిబిషన్ మైదానాన్ని సందర్శించేందుకు అనుమతి ఇవ్వడంతో ఉదయం నుంచి సందర్శకులు ఎగ్జిబిషన్‌కు తరలివస్తున్నారు. సాయంత్రం 6 తరువాత సందర్శకుల తాకిడి పెరుగుతున్నది. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజులపాటు ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తారు. 2,500 స్టాల్స్‌తో నిర్వహించిన ఎగ్జిబిషన్‌ను నగరంతోపాటు పొరుగు జిల్లాలు, ఇతర రాష్ర్టాలకు చెందిన ప్రజలు సందర్శించి స్టాళ్లల్లో ఏర్పాటు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు.ఎగ్జిబిషన్ సందర్శనకు వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నరోత్తంరెడ్డి, సొసైటీ ప్రతినిధులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com