నగరంలోని ఎస్ఆర్నగర్లో పోలీసులు చబుత్ర మిషన్ ఆపరేషన్ నిర్వహించారు. మద్యం సేవిస్తూ లేడీస్ హాస్టళ్ల వద్ద న్యూసెన్స్గా వ్యవహరిస్తూ అమ్మాయిలను వేధిస్తున్న 30 మంది పోకిరీలను పోలీసులు అదుపులోకి తీసుకుని, 10 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్నగర్ హాస్టళ్లలో అమ్మాయిలను వేధిస్తున్న ఆకతాయిలను పట్టుకున్న పోలీసులు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు.