సంగారెడ్డి జిల్లాలో 200 కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నగల్గిడ్డాలో కారులో 100 బ్యాగుల్లో అక్రమంగా తరలిస్తున్న 200 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ గంజాయి విలువ దాదాపు రూ. 10 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అనంతరం గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.