ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పరేడ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 16, 2018, 10:09 AM

మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇవాళ పరేడ్ నిర్వహించారు. ఆర్ఐ అడ్మిన్ నరసయ్య పరేడ్ కమాండర్ గా వ్యవహరించారు. ఎస్పీ ఎన్. కోటిరెడ్డి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ఎస్పీ కోటిరెడ్డి సిబ్బంది టర్న్ అవుట్ చెక్ చేశారు. సిబ్బంది తో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూరవి జాతర విజయవంతం చేసినందుకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇచ్చిన రెండు డాగ్స్ (పోలీస్ జాగిలాలు) బబ్లూ (తెలుపు), రైడర్ (బ్లాక్) మహబూబాబాద్ జిల్లాకు కేటాయించారు. దొంగలను పట్టుకోవడంలో ఈ రెండు జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని..నేర పరిశోధనలో ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com