హైదరాబాద్ : ‘జీఎస్టీ’ వెబ్ సిరీస్కు సంబంధించిన కేసులో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్వర్శ సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రాంగోపాల్వర్మపై సీసీఎస్లో సామాజికవేత్త దేవి, ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఓ ఛానల్లో జరిగిన జీఎస్టీ వెబ్ మూవీ చర్చలో వర్మ తనను దూషించారంటూ దేవి ఫిర్యాదు చేశారు. జీఎస్టీ వ్యవహారం, ఓ మహిళను కించపరిచారన్న అభియోగాలపై వర్మను సైబర్ క్రైం పోలీసులు విచారిస్తున్నారు. వర్మ విచారణకు హాజరైన నేపథ్యంలో సీసీఎస్ పోలీసుస్టేషన్ వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.