జార్ఖాండ్: ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న మావోయిస్టులకు కల్లెం వేసే దిశగా పోలీసులు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే జార్ఖండ్ రాష్ట్రంలోని దండకారణ్యాన్ని షల్టర్ జోన్గా చేసుకున్న మావోయిస్టులపై అక్కడి పోలీస్శాఖ ఉక్కుపాదం మోపేందుకు వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే శనివారం చైబాసా జిల్లాలోని కారికేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని డోంబ్రా సమీపంలో గల పుదహాట్ అటవీప్రాంతంలో గాలింపు చేపడుతున్న 170, 60వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ బలగాలకు మావోయిస్టులు తారస పడ్డారు. మొదట మావోయిస్టులు జవాన్లపై కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. పోలీసుల ప్రతిఘటన తీవ్ర స్థాయికి చేరుకోవడంతో మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. అయితే తప్పించుకున్నవారిలో మావోయిసుట నేత అజయ్ పుర్టితో పాటు సుమారు తొమ్మిది మంది సభ్యులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలం నుంచి ఏకే 47, 130 రౌండ్ బుల్లెట్స్, సాహితి పుస్తకాలు, నిత్యవసర సరుకులు, మావోయిస్టుల యూనిఫాంలు, ఇతరాత్ర సామాగ్రి స్వాధీనపరుచుకున్నట్లు ఎస్పీ మయూర్ పటేల్ వెల్లడించారు.