సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల్లోని 153 మంది కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్దిదారులకు శనివారం ఎమ్మెల్యే జలగం వెంకటరావు చేతుల మీదుగా రూ. కోటి ఆరు లక్షల 83 వేల 844 విలువ కలిగిన డీడీలను అందజేశారు. నిరుపేద, మైనార్టీ, బడుగు, బలహీన వర్గాల్లోని యువతుల వివాహం గురించి మహిళలు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా సీఎం కేసీఆర్ వారికి మేనమామలా వివాహాలు జరిపించేందుకు ఈ సహాయాన్ని అందిస్తున్నారని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే జలగం విశదీకరించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.