మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదుర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్తో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు. నెల్లికుదుర్ మండలం చిన్న ముప్పారం గ్రామంలో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను ఎంపీ ప్రారంభించారు. అదేవిధంగా గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన స్మశానవాటికకు శంకుస్థాపన, రూ. 10 లక్షలతో నిర్మించే ముదిరాజుల కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.