ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలాం కుటుంబ సభ్యులతో కమల్ భేటీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 21, 2018, 12:32 PM

చెన్నై : సినీ నటుడు కమల్ హాసన్ బుధవారం ఉదయం రామేశ్వరం చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం కుటుంబ సభ్యులతో కమల్ భేటీ అయ్యారు. ఆ తర్వాత కలాం సమాధిని సందర్శించారు. మరికాసేపట్లో రామేశ్వరం నుంచి పరమకొడి బయల్దేరనున్నారు. పరమకొడి, మధురైలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో కమల్ ప్రసంగించనున్నారు. మధురై సభలో కమల్ హాసన్ తన పార్టీ పేరును, జెండా వివరాలను ప్రకటించనున్నారు. పార్టీ ప్రారంభ వేడుకకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరు కానున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com