న్యూఢిల్లి :ఢిల్లి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్పై ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు దాడి చేసిన సంఘటనపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లి లెఫ్ట్నెంట్ గవర్నర్ (ఎల్జి)తో కాంగ్రెస్ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ ఘటనకు సంబంధించి ఢిల్లి ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ బృందంలోని నేతలు షీలా దీక్షిత్ తదితరులు డిమాండ్ చేశారు.