భోపాల్ : మధ్యప్రదేశ్ జబల్పూర్లోని బరేలాలో ఘోరం జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు అదుపుతప్పి.. రోడ్డుపక్కన ఉన్న ఇల్లు, దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆగ్రహంతో.. పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.