బెంగుళూరు: కర్నాటకలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అప్పుడే మాటల హోరు పెరిగింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఓ బచ్చాగా అభివర్ణించారు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప. కర్నాటకకు రాహుల్ వచ్చాడంటే తమకు 150 సీట్లు ఖాయమని యడ్యూరప్ప అన్నారు. రాహుల్ ఎన్నికల కోసం హిందువగా మారారని కూడా యడ్యూరప్ప ఇటీవల ఆరోపించారు. కర్నాటకు రాహుల్ రావడం అంటే బీజేపీకి మంచి రోజులు వచ్చినట్టే అని ఆయన తెలిపారు. రాహుల్ పర్యటన వల్ల కర్నాటక నుంచి కాంగ్రెస్కు విముక్తి లభిస్తుందని విమర్శించారు.