ఆదిలాబాద్ మున్సిపాలిటీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) కొండల్ రావు నివాసంలో ఎసిబి సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయాన్ని మించిన ఆస్తులు కూడబెట్టారని కొండల్రావుపై ఆరోపణలు రావడంతో ఎసిబి సోదాలు నిర్వహిస్తోంది. ఆదిలాబాద్, వరంగల్, కొత్తగూడెంలలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ 6 కోట్ల రూపాయిల అక్రమ ఆస్తులను ఎసిబి అధికారులు గుర్తించారు.