ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బల్దియా అభివృద్ధిక ఆర్థిక సహకారం కావాలి : జిహెచ్‌ఎంసి కమిషనర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 22, 2018, 11:11 AM

హైదరాబాద్ : బల్దియా అభివృద్ధికి ఆర్థిక సహకారం అవసరమని జిహెచ్‌ఎంసి కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి అన్నారు. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ద్వారా నిధులు సేకరించనున్నామని ఆయన చెప్పారు. మున్సిపాలిటీలు రెవిన్యూను జనరేట్‌ చేస్తాయని ఆయన అన్నారు. 8.9 శాతం వడ్డీతో అప్పు తీసుకుంటున్నామని మళ్లి తీర్చే అవకాశం సులువగా ఉంటుందని ఆయన చెప్పారు. వెయ్యి కోట్ల రూపాయిలకుగాను ముందుగా 200 కోట్ల రూపాయిలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఈ నిధులను ఎస్‌ఆర్‌డిపి ద్వారా నగరంలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, అండర్‌ పాస్‌, కారిడార్లకు వాడుకుంటామని ఆయన చెప్పారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com