దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన కుట్రదారుడు విపున్ అంబానీయేనని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఫైర్ స్టార్ ఇంటర్నేషనల్ సంస్ధ ప్రెసిడెంట్ (ఫైనాన్స్) అయిన విపున్ అంబానీ స్టేట్ మెంట్ ను ఇప్పటికే సీబీఐ, ఈడీ రికార్డ్ చేశాయి. ఇప్పటి వరకూ సీజ్ చేసిన డాక్యుమెంట్ల ఆధారంగా సీబీఐ, ఈడీలు విపున్ అంబానీని 11,400 కోట్ల కుంభకోణంలో ప్రమేయంపై ప్రశ్నల వర్షం కురిపించాయి.