జగిత్యాల: పలు అభివృద్ధి కార్యక్రమాలపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ నేడు సమీక్ష చేపట్టారు. చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కోడిమల్ మండల కార్యాలయంలో ఎంపీ నేడు అధికారులతో భేటీ అయ్యారు. సమావేశంలో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనుల పురోగతితో పాటు ఇతర కార్యక్రమాలపై ఎంపీ సమీక్ష చేపట్టారు.