వరంగల్ రూరల్ : ఆత్మకూర్ మండలం నీరుకుళ్ల, తిరుమలగిరి గ్రామాల్లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా రూ. 77 లక్షలతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఆయన తేల్చిచెప్పారు.