పాట్నా : బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ తన అధికార నివాసంలో అక్రమంగా ఆలయాన్ని నిర్మించారనే ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టనున్నది. ఒకవేళ ఆరోపణలు రుజువైతే తేజ్ ప్రతాప్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ప్రభుత్వం పలుమార్లు నోటీసులు పంపిన తరువాత ఇటీవలే తేజ్ ప్రతాప్ ఆ భవనాన్ని ఖాళీ చేశారు.