ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైకి సమీపంలోని ఎలిఫెంటా దీవులకు ఎట్టకేలకు విద్యుత్ సౌకర్యం లభించింది. ముంబై తీరానికి పది కిలోమీటర్ల దూరంలోని ఘరాపురీ దీవిలో ఉన్న ఎలిఫెంటా గుహలకు స్వాతంత్ర్యం వచ్చిన ఏదు దశాబ్దాల తరువాత ఈ సౌకర్యం వచ్చింది. ప్రపంచ వారసత్వ సంపదగా ఎలిఫెండా కేవ్స్ కు యునెస్కో గుర్తింపు కూడా ఉంది.