జమ్మికుంట: కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కర్కశుడిగా మారాడు. మ ద్యం మత్తులో నిత్యం 11ఏండ్ల కొడుకును కొడుతూ.. చిత్ర హింసలకు గురి చేస్తున్నాడు. ఓపిక నశించిన బాలుడు, శక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట సీఐ ప్రశాంత్రెడ్డికి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. జమ్మికుంట పరిధిలో ని మోత్కులగూడెంలో మోలుగూరి శ్రీనివాస్-రమ్యకు ఇద్దరు పిల్లలు. దంపతులు కూలీ చేసుకొని జీవిస్తున్నారు. కొడుకు శశికుమార్(11) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. కాగా, శ్రీనివాస్ నిత్యం ఏదో ఒక కారణంతో భార్య, కొడుకును కొడుతున్నాడు. ఇంట్లో నగదు పోయిందని బా లుడిని రెండు రోజులుగా కొడుతున్నాడు. గురువారం సాయంత్రం బాలుడిని ఇంట్లోకి తీసుకెళ్లి దుడ్డు కర్రకు కారం పూసి విచక్షణరహితంగా చితకబాదగా, భరించలేక బాలుడు గురువారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. భార్యనూ శ్రీనివాస్ వెళ్లగొట్టాడు. దీంతో బాలుడు జమ్మికుంట సీఐని ఆశ్రయించాడు. మొత్తం విన్న సీఐ చలించిపోయి, శ్రీనివాస్పై కేసు నమోదు, అరెస్ట్ చేశారు.