హైదరాబాద్:హైదరాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో 24న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా మినీ జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్ మైత్రిప్రియ పేర్కొన్నారు. పలు పైవేటు సంస్థల్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, డెలివరి ఎగ్జిక్యూటివ్స్ తదితర భర్తీల కోసం జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులన్నారు. 200 పోస్టులకు జరిగే ఈ ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థులకు 12 వేల నుంచి 20 వేల రూపాయల వేతనం అందిస్తామన్నారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు శనివారం విజయనగర్కాలనీలోని మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలోని హైదరాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. వివరాలకు రఘుపతి-8247656356 నెంబర్లో సంప్రదించాలని కోరారు.