ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతు సమితి సభ్యులతో త్వరలో సమావేశం: పోచారం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 26, 2018, 12:14 PM

కరీంనగర్‌ : త్వరలో 1.61 లక్షల మంది రైతు సమితి సభ్యులతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్‌లో రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సుకు మంత్రి పోచారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోటి యాభై లక్షల ఎకరాల్లో సాగుచేయడమే మన లక్ష్యమన్నారు. రైతు సమన్వయ సమితి సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేసిందని..ఇది ఆశామాషీ వ్యవహారం కాదని పోచారం తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితోపాటు మంత్రి ఈటల రాజేందర్ పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa