ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.51 వేల నుంచి రూ.75 వేలకు పెంపు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 13, 2017, 01:17 PM

హైదరాబాద్: బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం కళ్యాణలక్ష్మి పథకానికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వరాలు ప్రకటించారు. కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఇప్పటివరకు ఇస్తున్న రూ.51 వేల నుంచి రూ.75,116కు పెంచుతున్నట్లు ప్రకటించారు. పేదింటి ఆడపడుచుల పెళ్లికి అండగా నిలవాలన్న ఉద్దేశంతో ఈ వినూత్న పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేళపెట్టింది. మొదట్లో కేవలం ఎస్సీ, ఎస్టీవారికే ఈ పథకాన్ని అమలు చేసినా తర్వాత బీసీలను కూడా ఇందులో చేర్చారు. ఇక ముస్లిం యువతుల కోసం షాదీ ముబారక్ పేరుతో ఇంతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa