మంథని: నియోజకవర్గ కేంద్రమైన మంథని మేజర్ గ్రామపంచాయతీని మంగళవారం నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పుట్ట శైలజతో కలిసి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు, అభివృద్ధికి సమీక్షించారు. గతంలో కంటే ప్రస్తుతం మంథని పట్టణం చాలా అభివృద్ధిలో ఉందని ఈ సందర్భంగా సర్పంచ్ పుట్ట శైలజను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎ మ్మెల్యే పుట్ట మధుతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa