మార్చిలోకి అడుగుపెట్టాం. నెమ్మదిగా ఎండల తీవ్రత పెరుగుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం మెల్లగా కనిపిస్తోంది. ఇక ఏప్రిల్, మే నెలల్లో నిప్పుల కుంపటిని తలపించేలా ఎండలు ఉండనున్నాయి. ఏటేటా తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈ ఏడాది కూడా ఎండలు ఠారెత్తిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గతంలో కంటే సగటున 1 డిగ్రీ కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తోంది.
రుతుపవనాల ఆగమమనానికి ముందే అంటే.. మే నెలాఖరు వరకు దేశవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా వేడి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. మధ్యభారతంలో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తోంది.పంజాబ్ నుంచి తెలంగాణ వరకు వేడి గాలలు తీవ్రత ఎక్కువగా ఉంటుందని, కోస్తాంధ్రలోనూ వడగాలులు అధికంగా వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు, రాయలసీమలో 0.5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. కాబట్టి.. ఈ వేసవిలో మరింత జాగ్రత్తగా ఉండండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa