హైదరాబాద్: నగరంలో ఆటో డ్రైవర్లపై ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఏ అధికారులు చేస్తున్న వేధింపులకు నిరసనగా ఈ నెల 8న ఒక రోజు జరిగే ఆటోల బంద్ను పాటించి విజయవంతం చేయాలని తెలంగాణ ఆటో జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ ఆటో డ్రైవర్లకు పిలుపునిచ్చారు. ఆదివారం హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడుతూ నగరంలో ప్రయాణికులను సురక్షితంగా వారి వారి గమ్యాలకు చేర్చుతున్న ఆటో డ్రైవర్లపై చిన్న, చిన్న కారణాలను చూపిస్తూ ట్రాఫిక్ పోలీసులు వేధింపులకు గురి చేయడం సరైన విధానం కాదన్నారు.
ఇటీవల టోలిచౌకిలో ఆక్రం అనే ఆటో కార్మికుడికి అక్కడి ట్రాఫిక్ పోలీసులు అకారణంగా చాలన్లు విధించి కేసు నమోదం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఆటోలపై ఉన్న ఎంవీ ట్యాక్స్ను రద్దుచేసి ప్రమాదవశాత్తు మరణించిన ఆటో డ్రైవర్లకు ప్రమాద భీమా పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుండగా ట్రాఫిక్ పోలీసులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం 8వ తరగతి విద్యార్హతను మినహాయించి, ఆటోడ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa