ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు జిమ్నాస్ట్ అరుణకి రూ.2 కోట్ల నజరానా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 05, 2018, 10:45 AM

జిమ్నాస్టిక్ ప్రపంచకప్‌లో భారత్‌కి కాంస్య పతకం అందించిన తెలుగు జిమ్నాస్ట్ బుడ్డా అరుణ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. అరుణ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఆదివారం కలిసింది. ఈ సందర్భంగా అరుణని అభినందించిన కేసీఆర్‌.. రూ. 2 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఇలానే మరిన్ని పతకాలు సాధించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.


ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో గత వారం జరిగిన జిమ్నాస్టిక్ ప్రపంచకప్‌లో అరుణ 13.469 పాయింట్లతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ ప్రపంచకప్‌కి మొత్తం 16 దేశాల నుంచి అథ్లెట్స్‌ ప్రాతినిథ్యం వహించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తరఫున క్రీడా శాఖ మంత్రి పద్మారావు రూ. 20 లక్షలు నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa