అగర్తల: త్రిపుర అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ(35)-ఐపీఎఫ్టీ(8) కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. 60 అసెంబ్లీ స్థానాలకు గాను 59 స్థానాల్లో పోలింగ్ నిర్వహించారు. వీటిలో భాజపా కూటమికి 43 సీట్లు దక్కాయి. సీపీఎం 16సీట్లతో సరిపెట్టుకుంది. 25ఏళ్ల వామపక్ష పాలనకు తెరదించి బీజేపీ అధికారం చేపట్టబోతోంది. ఈ ఘోర పరాజయంపై ఆ రాష్ట్ర ఆపధర్మ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తాజాగా స్పందించారు. ఈ ఓటమికి గల కారణాలపై సమీక్షిస్తాం. ఇలాంటి ఫలితం వస్తుందని అంచనా వేయలేదు. ఇది పూర్తిగా ఊహించని ఫలితమే. రాష్ట్రం నలుమూలల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నాం. గణాంకాలను విశ్లేషించకుండా తుది నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు. కాబట్టి మేము వేచి ఉండాలి. భారీ మొత్తంలో నగదు, ఇతర వనరులను ఉపయోగించుకొని ఎన్నికలను బీజేపీ ప్రభావితం చేసిందని సీపీఎం ఆరోపించిన విషయం తెలిసిందే. మాణిక్ సర్కార్ త్రిపురకు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. శనివారం వెల్లడైన ఫలితాల్లో బీజేపీ-ఐపీఎఫ్టీ కూటమి విజయం సాధించిన నేపథ్యంలో ఆదివారం మాణిక్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ తథాగత్ రాయ్ సూచనమేరకు కొత్త కేబినెట్ ప్రమాణం చేసేవరకు మాణిక్ ఆపధర్మ ముఖ్యమంత్రి కొనసాగనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa