ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 05, 2018, 11:15 AM

ముంబయి: దేశీయ రాజకీయ పరిస్థితులు..అంతర్జాతీయ, ఆసియా మార్కెట్ల బలహీన సంకేతాల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. స్టీల్‌, అల్యూమినియంపై దిగుమతి సుంకాన్ని పెంచాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఫెడ్‌ రిజర్వ్‌ పరిణామాలపై మదుపర్లు దృష్టి పెట్టడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో సోమవారం సూచీలు భారీ నష్టాలతో మొదలయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా కోల్పోగా.. నిఫ్టీ కూడా 10,400 దిగువకు పడిపోయింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 225 పాయింట్లు కోల్పోయి 33,822 వద్ద, నిఫ్టీ 79 పాయింట్ల నష్టంతో 10,379 వద్ద కొనసాగుతున్నాయి.


రిలయన్స్‌, టాటాస్టీల్‌, అరబిందో ఫార్మా,  టాటామోటార్స్‌, యస్‌ బ్యాంక్‌, హిందాల్కో తదితర షేర్లు భారీ నష్టాల్లో సాగుతుండగా.. ఐటీ రంగ కంపెనీలు టెక్‌ మహింద్రా, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ తదితర షేర్లు స్వల్ప లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa