మేఘాలయలో భాజపా మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ నుంచి ఆ పార్టీకి ఆహ్వానం అందింది. ఆ పార్టీ అధ్యక్షుడు కాన్రాడ్ సంగ్మా రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా మంగళవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమకు అవకాశం ఇవ్వాలని సంగ్మా ఆదివారం సాయంత్రం గవర్నర్ గంగాప్రసాద్ను కలిసి కోరారు. రెండు ప్రాంతీయ పార్టీలు, ఒక స్వతంత్ర సభ్యుడితో సహా మొత్తం 34 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ లేఖ సమర్పించారు. అయితే రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ శనివారమే గవర్నర్ను కలిసింది. చివరికి 34 మంది ఎమ్మెల్యేలు ఉన్న సంగ్మా వైపే గవర్నర్ మొగ్గు చూపారు.
మెఘాలయ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడ్డాయి. కాంగ్రెస్ 21 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్పీపీ 19, భాజపా 2, ఇతరులు 17 స్థానాల్లో విజయం సాధించారు. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైంది. గోవా, మణిపూర్ రాష్ట్రాల తర్వాత.. కాంగ్రెస్ పార్టీ ఇలా విఫలవమవడం ఇది మూడోసారి. మెజారిటీ సీట్లు గెలుచుకున్నప్పటికీ గోవా, మణిపూర్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa