ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సారు ఢిల్లీలో అడుగెడితే అన్నీ మారతాయ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 06, 2018, 11:47 AM

దేశ రాజకీయాలలో కేసీఆర్ కీలక శక్తిగా మారనున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు 30కి పైగా పార్టీలను ఒప్పించిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. ఈమేరకు టీఆర్‌ఎస్‌ఎల్పీలో సోమవారం శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలది బస్సుయాత్ర కాదు, తుస్సు యాత్ర అని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న సీట్లు కూడా కోల్పోయే పరిస్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు. దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నపుడు పార్టీలకతీతంగా స్వాగతించాలన్నారు. కానీ కొందరు ప్రతిపక్ష నేతలు నోరుందని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల పసిగుడ్డు తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందంటే అది కేసీఆర్ పాలన చలవేనని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనే చతికిలపడ్డ బీజేపీ రాష్ట్రంలో ఏం ఉద్దరిస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉన్న ఒక్క బీసీ నేత దత్తాత్రేయను కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పించారన్నారు. ప్రస్తుతం తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీలో కేసీఆర్ రూపంలో గుర్తింపు పొందుతుంటే హర్షించాలని పేర్కొన్నారు. కేసీఆర్ ఒక్కసారి ఢిల్లీలో కాలుమోపారంటే రాజకీయ వాతావరణం మొత్తం మారిపోతుందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa