ఢిల్లీ : వాయిదా అనంతరం 11.30 గంటలకు ప్రారంభమైన రాజ్యసభలో పలు అంశాలపై విపక్ష సభ్యులు ఆందోళన నిర్వహించారు. విభజన హామీలు అమలు చేయాలని టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ ఆందోళన చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు సభ్యులను ఆందోళన విరమించాలని, సభ కార్యక్రమాలు సజావుగా కొనసాగేందుకు సహకరించాలని సభ్యులను కోరారు. అయినా సభ్యులు వినకుండా తమ ఆందోళనకు కొనసాగించారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. పార్లమెంటులో సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించడం సరైంది కాదని వెంకయ్య నాయుడు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa