అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన 20 మంది ప్రముఖ మహిళలకు మార్చి 8న అవార్డులను అందించనుంది. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెలబ్రేషన్స్ కమిటీ.. ఈ అవార్డు జాబితాను రూపొందించింది. ఈ అవార్డులకు ఎంపికైన 20 మంది మహిళలను ప్రభుత్వం మార్చి 8న 1 లక్ష నగదు రివార్డుతో సత్కరించనుంది.విద్య, వైద్యం, క్రీడా, సాహిత్యం, నాట్యం, సంగీతం తదితర రంగాలకు చెందిన మహిళలు అవార్డులకు ఎంపికైన వారిలో ఉన్నారు. ఇటీవల జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ లో సత్తాచాటి కాంస్య పథకం సాధించిన అరుణారెడ్డితో పాటు, సినిమా డైరెక్టర్ నందినీ రెడ్డి, హైదరాబాద్ మెట్రో రైల్ డ్రైవర్ సుప్రియ సనం, ఢిల్లీ ఆర్టీసీ డ్రైవర్ సరితలు అవార్డుకు ఎంపికయ్యారు. విద్యారంగంలో కవిత దరియాణి, వైద్యంలో సత్యలక్ష్మీ, సాహిత్య రంగంలో చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ, సిరి, నాట్యంలో మంజులా శ్రీనివాస్,సంగీతంలో నిత్య సంతోషిణి, చిత్రకళలల విభాగంలో కవితా దేవుష్కర్, సినిమా రంగంలో నందినిరెడ్డి, జానపద సాహిత్యం విభాగంలో ఝాన్సీ, ఉద్యమగానంలో ఎదునూరి పద్మ, మహిళా వ్యాపారవేత్త-రాజ్యలక్ష్మి, జర్నలిజంలో లతాజైన్, నాగపురి సౌమ్య అవార్డులకు ఎంపికయ్యారు.మహిళా సాధికారత విభాగంలో యాప భద్రమ్మ, వ్యవసాయం రంగంలో బొగ్గం జయమ్మ, ప్రజాప్రతినిధుల నుంచి కొత్తపల్లి సర్పంచ్ శైలజ, సామాజిక సేవ రంగంలో గండ్ర రమాదేవిలను అవార్డులకు ఎంపిక చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa