ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లెనిన్ విగ్రహాన్ని కూల్చిన బీజేపీ కార్యకర్తలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 06, 2018, 12:03 PM

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన కొన్ని గంటల్లోనే బీజేపీ, లెఫ్ట్ మద్దతుదారులు ఘర్షణకు దిగారు. ఆ అల్లర్ల కారణంగా దక్షిణ త్రిపురలోని బెలోనియా పట్టణంలో ఉన్న మార్కిస్టు నేత లెనిన్ విగ్రహం ధ్వంసం అయ్యింది. బుల్‌డోజర్లతో లెనిన్ విగ్రహాన్ని బీజేపీ కార్యకర్తలు కూల్చివేశారు. ఈ ఘటన పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఆ రాష్ట్ర గవర్నర్, పోలీస్ చీఫ్‌తో ఆయన మాట్లాడారు. నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు హింస చోటుచేసుకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్ ఆదేశించారు. గత 48 గంటల్లో మొత్తం ముగ్గుర్ని అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి అనేక అల్లర్లు చోటుచేసుకున్నట్లు ఫిర్యాదుల అందుతున్నాయి. రాష్ట్ర ప్రజల్లో బీజేపీ భయం సృష్టిస్తోందని సీపీఎం ట్వీట్ చేసింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa