రెండు దశాబ్దాల తర్వాత త్రిపుర ఓ కొత్త సీఎంను చూస్తున్నది. ఎన్నికల్లో రెండున్నర దశాబ్దాల లెఫ్ట్ ప్రభుత్వాన్ని ఓడించి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. తమ కొత్త సీఎంగా విప్లవ్ కుమార్ దేవ్ను ప్రకటించింది. త్రిపురలో బీజేపీ-ఐపీఎఫ్టీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విప్లవ్కుమార్ దేవ్ మాట్లాడుతూ.. జిష్ణు దేవ్ బర్మన్ డిప్యూటీ సీఎంగా ఉంటారని చెప్పారు. త్రిపురలో బీజేపీ విజయం సాధించిన మరుక్షణం నుంచే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న విప్లవ్కుమార్ సీఎం రేసులో ముందున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో బనమాలిపూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆరెస్సెస్ వలంటీర్గా కూడా విప్లవ్ పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు విప్లవ్.. జిమ్ ట్రైనర్గా పనిచేశారు. త్రిపురలో మొత్తం 59 నియోజకవర్గాలు ఉండగా.. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ, పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ) కూటమికి 43 స్థానాలు వచ్చాయి. ఇందులో బీజేపీయే 35 స్థానాలు గెలవడం విశేషం. ఆదివాసీల కోసం రిజర్వ్ చేసి ఉన్న 20 స్థానాలనూ ఈ కూటమే కైవసం చేసుకుంది. 2013 ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవని బీజేపీ.. ఇప్పుడు ఏకంగా 35 స్థానాలు గెలవడం విశేషమే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa