ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీ బాటలోనే రాహుల్ గాంధీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 06, 2018, 01:46 PM

ప్రధాని మోదీ విదేశీ పర్యటనల గురించి గతంలో విపక్ష నేతలు ఛాన్స్ దొరికిన ప్రతిసారీ కాస్త కఠిన వ్యాఖ్యలతోనే విమర్శలు చేస్తుండడం తెలిసిందే. ప్రధాని మోదీ ఎప్పుడు విదేశాల్లో తిరుగుతుంటారు...అప్పుడప్పుడు దేశానికి వస్తుంటారని అప్పట్లో కాంగ్రెస్ నేతలు తీర్పారబట్టారు. అయితే ఇప్పడు ఇదే తరహా విమర్శలు తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా చుట్టుముట్టడంతో ఎలా ఎదుర్కోవాలో కాంగ్రెస్ నేతలకు మింగుడుపడడం లేదు. ఇటీవల రాహుల్ గాంధీ తన అమ్మమ్మతో గడిపేందుకు ఇటలీలో పర్యటించడంపై రాజకీయ ప్రత్యర్థులు విమర్శనాస్త్రాలు సంధించారు. ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, మేఘాలయ, నాగలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ రోజున రాహుల్ ఇటలీ పర్యటనలో గడపడాన్ని తప్పుబట్టారు. 


ఇప్పుడు మరోసారి రాహుల్ గాంధీ ఈ నెల 8 నుంచి విదేశీ పర్యటనలకు శ్రీకారంచుట్టనుండడంతో రాజకీయ ప్రత్యర్థులు మళ్లీ తమ నోళ్లకు పనిచేబుతున్నారు. ఈ నెల 8,9 తేదీల్లో సింగపూర్‌లో పర్యటించనున్న కాంగ్రెస్ చీఫ్...ఈ నెల 10న మలేషియాలో పర్యటిస్తారు. సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడి ప్రవాస భారతీయులనుద్దేశించి మాట్లాడడంతో పాటు...భారత ప్రొఫషనల్స్, పారిశ్రామికవేత్తలతోనూ ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. అటు మలేషియా పర్యటనలో ప్రవాస భారతీయులతో సమావేశంకావడంతో పాటు...అక్కడి వాణిజ్యవేత్తలతోనూ ప్రత్యేకంగా సమావేశం అవుతారు. 


ప్రధాని నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనల్లో అక్కడి ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా సమావేశమవుతూ ఉంటారు. ఇప్పుడు అదే బాటలోనే రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనల్లో ప్రవాస భారతీయులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశం అవుతోంది. గతంలో అమెరికా, బెహ్రెయిన్ పర్యటనల్లో అక్కడి ప్రవాసభారతీయులతో రాహుల్ సమావేశం కావడం తెలిసిందే. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa