కొలంబో: శ్రీలంకలో పది రోజుల ఎమర్జెన్సీని ప్రకటించింది ప్రభుత్వం. పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలు అదుపు తప్పడంతో దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే సెంట్రల్ శ్రీలంకలోని క్యాండీలో గత వారం రోజులుగా హింస జరుగుతోంది. మైనారిటీ వర్గాలపై మెజారిటీ వర్గాలకు చెందిన కొందరు వరుస దాడులకు పాల్పడ్డారు. ఇవి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించడంతో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇదిలా ఉంటే 'నిదహాస్ ట్రోపీ' టీ-20 సిరీస్ను ఆడేందుకు భారత క్రికెట్ టీం ప్రస్తుతం శ్రీలంకలో ఉంది. సిరీస్లో భాగంగా మంగళవారం మొదటి మ్యాచ్ మంగళవారం జరగనుంది. అయితే శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించడంతో.. టీమిండియా అక్కడ చిక్కుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa