హైదరాబాద్: నగరంలోని మూసాపేట పై వంతెనపై బస్సు ప్రమాదం జరిగింది. సియెంట్ కంపెనీకి చెందిన ఉద్యోగుల బస్సు విభాగినిని ఢీకొని కిందకు పడిపోయింది. ఆ సమయంలో బస్సులో దాదాపు 50 మంది వరకు ఉన్నారు. వారంతా వెంటనే బస్సులో నుంచి బయటకు దూకేయడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు మాదాపూర్ నుంచి చింతల్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa