ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆధార్ గడువును మరోసారి పొడిగించనున్న కేంద్రం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 07, 2018, 11:15 AM

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, పాన్ నెంబర్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ మార్చి 31 వరకు కేంద్రం గడువు విధించిన విషయం తెలిసిందే. అయితే మరోసారి ఈ గడువును పొడిగించే ఆలోచనలో ఉన్నట్టు సుప్రీంకోర్టుకు కేంద్రం సూచనప్రాయంగా వెల్లడించింది. ఆధార్ కేసుపై సుదీర్ఘ విచారణ కొనసాగుతున్నందున, అనుసంధానానికి గడువు మరికొన్ని రోజులు పెంచనుంది. ఆధార్ అనుసంధానంపై కేసును విచారిస్తోన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ఐదురుగు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి గడుపు పొడిగింపుపై అటార్నీ జనరల్ కే వేణుగోపాల్ మంగళవారం తెలియజేశారు.


ఆధార్ అనుసంధానం గడువును గతంలోనే పెంచారని, మరోసారి పెంచనున్నారు కానీ ఈ నెలాఖరుకు దీనిపై ప్రకటన వెలువడినా కేసులో పిటిషనర్ల వాదనలు పూర్తిచేయాలని అటార్నీ జనరల్ కోరారు. అటార్నీ జనరల్ లేవనెత్తిన అంశం కీలమైందని, ఈ కేసులో పిటిషనర్ల పునరావృత వాదనలకు ఆస్కారం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. గత డిసెంబరు 15గా ఉన్న ఆధార్ అనుసంధానం గడువును సుప్రీంకోర్టు సూచనలతో కేంద్రం మార్చి 31 వరకు పొడిగించింది. రాజ్యాంగ సమగ్రతకు సవాల్‌గా మారిన ఈ కేసు విచారణ పూర్తయినంతవరకు మార్చి 31 గా ఉన్న గడువును పొడిగించాలని సీనియర్ న్యాయవాది శ్యామ్ దివన్ కోరారు.


వివిధ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయడంతో వివిధ శాఖలు, సంస్థలు సర్దుబాటు, సమన్వయం చేసుకోవాల్సి ఉన్నందున గడువు మార్చి 31ని పొడిగించాలని ఆయన అభ్యర్థించారు. జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ ఒకవేళ కోర్టు తీర్పు మార్చి 20 న వెలువరిస్తే, బ్యాంకులు, ఇతర సంస్థలు ఆధార్‌ అనుసంధానానికి కేవలం పది రోజులు మాత్రమే ఉంటుందని, ఇది చాలా కష్టంతో కూడుకున్నదని అన్నారు. బుధవారం కూడా ధర్మాసనం ముందు వాదనలు వినిపించనున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa