ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు రోజ్ గార్డెన్ ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 09, 2018, 09:02 AM

హైదరాబాద్ లోని లక్డీకాపూల్ జంక్షన్‌లో రూ. 30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన రోజ్ గార్డెన్‌ను శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ డా.బి. జనార్ధన్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్ధీన్ పాల్గొంటారని అధికారులు తెలిపారు. పాత వాహనాలు, వ్యర్థాలున్న లక్డీకాపూల్ జంక్షన్‌ను శుభ్రంచేసి అక్కడ జీహెచ్‌ఎంసీ అందమైన రోజ్ గార్డెన్‌ను ఏర్పాటు చేసింది. గతంలో సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ కొనసాగిన ఈ ప్రాంతం ఆ పోలీస్‌స్టేషన్ కూలిన తరువాత వ్యర్థాలకు నిలయంగా మారింది. ఈ నేపథ్యంలో ఒకరోజు అటుగా ప్రయాణించిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు నగరం నడిబొడ్డున వ్యర్థాలతో ఉన్న ఈ ప్రాంతంలో ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఇక్కడ గులాబీ ఫౌంటెన్‌తో కూడిన గార్డెన్‌ను ఏర్పాటు చేశారు. గులాబీ పువ్వు ఆకృతి, రంగురంగుల లైటింగ్‌తో కూడిన ఫౌంటెన్‌ను ఏర్పాటు చేసి వివిధ రకాల పూల మొక్కలను పెంచారు. గార్డెన్ చుట్టూ గోడ నిర్మాణంతోపాటు స్టీల్ రేలింగ్ నిర్మించారు. అలాగే అక్కడి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి రంగులుమారే ఫౌంటెన్‌ను, సీజనల్ మొక్కలను ఏర్పాటు చేశారు. ఈ గార్డెన్ ఏర్పాటుతో జంక్షన్ చూడచక్కగా, సెల్ఫీ కేంద్రంగా మారే అవకాశముంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa