ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శికి సైబర్‌చీటర్ల బురిడీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 09, 2018, 08:59 AM

హైదరాబాద్ : మలేషియా వెళ్లేందుకు ఎయిర్ టిక్కెట్ కోనే ప్రయత్నంలో ఆరోగ్య శాఖ కేంద్ర మాజీ కార్యదర్శి, రిటైర్డు ఐఏఎస్ అధికారి సుజాతారావును సైబర్‌ చీటర్లు మోసం చేశారు. ఈ మేరకు ఆమె సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మలేషియా వెళ్లేందుకు ఫిబ్రవరి 13న వీసా, విమాన టిక్కెట్ల కోసం గూగుల్‌లో సర్చ్ చేస్తుండగా మలేషియా ఆన్‌లైన్‌వీసా. ఓఆర్‌జీ వెబ్‌సైట్ ఓపెన్ అయ్యింది. అందులో వివరాలు పూర్తి చేసిన తరువాత, వారు చెప్పిన చార్జీలు ఎక్కువగా ఉన్నాయని ఆమె డ్రాప్ అయ్యింది. అయితే రెండు దఫాలుగా సుజాతారావు ఖాతాలో నుంచి రూ.16605 ట్రావెల్ ఏజెంట్ ఖాతాలోకి బదిలీ అయ్యాయి. ఆ డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ ఆమె సదరు నిర్వాహన సంస్థను కోరింది. 10 రోజుల్లో డబ్బు వెనక్కి పంపిస్తామంటూ చెప్పారు. అయితే 10 రోజులైనా డబ్బు వెనక్కి రాకపోవడంతో.. ఆ సంస్థ చీటింగ్‌కు పాల్పడిందని, దానిపై అనుమానం ఉందని ఆమె సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని ఇన్‌స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ దర్యాప్తు చేపట్టారు. మోసానికి పాల్పడింది సైబర్ చీటర్లుగా అనుమానిస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa