హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణలో రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కు అవమానం జరిగిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. ఎస్సీ ప్లీనరీలో మాట్లాడిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు మీద చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరు మార్చి.. ఆయనను అవమానించిందని అన్నారు. తెలంగాణలోని ఉమ్మడి ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేసే ఈ నీరు పారితే అంబేద్కర్ పేరు నిలిచిపోతుందనే అక్కసుతోనే ఈ ప్రాజెక్టును కేసీఆర్ చంపేశాడని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత, బహుజనులకు ఆర్థి, రాజకీయ, సామాజిక సాధికరతను కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కల్పించగలదని అన్నారు. సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ లోగల జయలక్ష్మి గార్డెన్స్ లో నిర్వహించిన తెలంగాణ ఎస్సీ ప్లీనరీలో ఆయన ప్రసంగించారు. 60 ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దళితులు వంచనకు, మోసానికి, అవమానాలకు గురవుతున్నారన్నారు. తెలంగాణ వస్తే దళితుడినే తొలి ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన కేసీఆర్.. అధికారంలోకి రాగానే మాట మార్చి.. తానే సీఎం కుర్చీ ఎక్కారని, అదే విధంగా.. అధికారంలోకి వస్తే దళితులకు మూడెకరాలు ఇస్తానన్న వాగ్దానాన్ని పూర్తిగా విస్మరించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కతో పాటు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్ ఛార్జి డాక్టర్ రామచంద్ర కుంతియా, ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa