ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏడాది చివ‌ర‌కు పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ పూర్తి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 10, 2018, 11:13 AM

ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి ఎయిర్‌ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతుందని కేంద్ర పౌర విమానయానశాఖ సహాయమంత్రి జయంత్‌ సిన్హా చెప్పారు. దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభించామని, త్వరలో దీనిపై స్పష్టమైన అవగాహన వస్తుందన్నారు.


కేంద్రం ప్రతిపాదించిన ఉదాన్‌ ఫ్లాట్‌ఫాంకు మంచి స్పందన వస్తుందన్నారు. గౌహతి నుంచి ఆగ్నేయ ఆసియా దేశాలకు విమాన సర్వీసులు నడిపేందుకు కొన్ని కంపెనీలు ముందుకు వచ్చాయని దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన సహకారాలు అందిస్తుందన్నారు. శ్రీనగర్‌తో పాటు మరికొన్ని చిన్న చిన్న నగరాల నుంచి కూడా విమానాలు నడిపేందుకు ప్రైవేటు సంస్థలు ముందుకువచ్చాయని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో జరుగుతున్న వింగ్స్‌ ఇండియా ఎగ్జిబిషన్‌ను మంత్రి సందర్శించారు. ఎగ్జిబిషన్‌లో పాల్గొన్న విమాన సంస్థల స్టాల్స్‌ను కేంద్ర మంత్రి సందర్శించారు.


 


ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, విమానయానశాఖ రక్షణ అంశానికై అధిక ప్రాధాన్యత ఇస్తుందని దీనికి ప్రపంచ ప్రమాణాలు పాటిస్తున్నామన్నారు. అంతకుముందు వింగ్స్‌ ఇండియాలో పాల్గొన్న ఎయిర్‌కార్గో ఇండస్ట్రీ ప్రతినిధులతో కేంద్రమంత్రి సమావేశం అయ్యారు. ఎయిర్‌కార్గో రంగం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఇది ఆర్థిక వ్యవస్థలో పౌర విమాన పరిశ్రమలాగ ప్రాధాన్యతతో విస్తరిస్తుందని ఆయన అన్నారు. ఎయిర్‌కార్గోను ప్రపంచస్థాయి పరిశ్రమలా తీర్చిదిద్దాల్సి ఉందని, దీనికి ప్రభుత్వం సదుపాయకల్పనలో పాల్గొంటుందని చెప్పారు. విధానాల రూపకల్పన, నియంత్రణలోనే జోక్యం చేసుకుంటుందని చెప్పారు. ప్రైవేటు సంస్థలు తమ పెట్టుబడులు, గమ్యాలు, వ్యాపారాలను నిర్దేశించుకోవాలని జయంత్‌ సిన్హా సూచించారు. కార్గో రంగం యేటా 15శాతం పెరుగుతుందని, యేటా 3.7లక్షల టన్నుల వస్తువులను రవాణా చేస్తుందని ఆయన చెప్పారు. ఇందులో ముఖ్యంగా ఆహార వ్యవసాయ, ఫార్మా, లెదర్‌, టెక్స్‌టైల్స్‌ ఉత్పత్తులు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఈ సందర్భంగా భారత్‌, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ(ఐఏటీఏ)ల మధ్య స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై ఒక అవగాహన కుదుర్చుకున్నారు.


అలాగే కార్గో రవాణాను సులభతరం చేసేందుకు రెండు ఈ-ఫ్రైట్‌ పోర్టల్స్‌ను ఆవిష్క రించారు. ఇందులో ఒక పోర్టల్‌ ప్రపంచంలోనే మొదటిగా ఉంటుంది. ఎయిర్‌పోర్టులలో 120రోజులకు మించి కార్గో నిలిచిపోతే దానిని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వ క్యాబినేట్‌ సెక్రటరీ చైర్మన్‌గా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని వింగ్స్‌ ఇండియా సమావేశంలో నిర్ణయించారు. దీని వలన విమానశ్రయాల్లో కార్గో విమానాలను ఎప్పటికప్పుడు తరలించి కొత్తవాటికి అవకాశం కల్పించేందుకు వీలవుతుంది. ప్రస్తుతం 60శాతం ఎయిర్‌కార్గో కేవలం 10దేశీయ అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌ ద్వారా, దేశంలోని 10 ప్రధాన ఎయిర్‌ఫోర్స్‌ నుంచి సాగుతుంది. అయితే ప్రాంతీయ ఎయిర్‌పోర్ట్స్‌లో కూడా ఎయిర్‌కార్గో సేవలు విస్తరించేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రౌండ్‌టేబుల్‌ సమావేశం సందర్భంగా వ్యవసాయ, ఫుట్‌పాత్‌లు, హెచ్‌వోడె వలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ డీకే.సింగ్‌, ఫార్మాఎక్స్‌పోర్ట్స్‌ కౌన్సిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ రవి ఉదయభాస్కర్‌, ఎక్స్‌ప్రెస్‌ ఇండస్ట్రీ కౌన్సిల్‌, ఆన్‌ ఈకామర్స్‌ సీవోవో విజయ్‌కుమార్‌ తదితరులు ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొని ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలపై దృశ్య ప్ర‌ద‌ర్శ‌న‌ ఇచ్చారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa