ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో సాగుతున్న నియంతృత్వ పాలన : హరగోపాల్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 11, 2018, 03:50 PM

హైదరాబాద్‌ : తెలంఆణలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. తెలంగాణ ప్రజలు నిర్బంధాన్ని సహించరని ఆయన చెప్పారు. తెలంగాణ వస్తే ఎన్‌కౌంటర్లు జరుగవని అన్నారని, తెలంగాణలోనే ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఎన్‌కౌంటర్లు చేసిన పోలీసులపై కేసులు పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. పోలీసులు నిర్బంధ పాలన సాగిస్తున్నారని ఆయన అన్నారు. ఉద్యమాలతో వచ్చిన తెలంగాణలో ఉద్యమాలు చేయద్దంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలను వారి సమస్యలను చెప్పుకోనీయండి ఆయన అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa