హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమవేశాలు ప్రారంభం అయ్యాయి, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది. సభ వాయిదా అనంతరం బీఏసీ సమావేశం జరుగుతుంది. బీఏసీ సమావేశంలో బడ్జెట్ సమావేశాల అజెండాను ఖరారు చేస్తారు. అలాగే 11 గంటలకు తెరాస రాజ్యసభ అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేస్తారు. బంగారు తెలంగాణ సాధనకు ప్రభుత్వం చేపట్టిన పథకాలు దోహదపడతాయని అన్నారు. తెలంగాణ అసెంబ్లి బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సభలో గవర్నర్ ప్రసంగిస్తున్నారు. రాష్ట్రం ఆర్థికాభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. ప్రభుత్వం త్వరలో పట్టాదార్ పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు గవర్నర్ చెప్పారు. అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ విజయాలను ఆయన వివరిస్తున్నారు. కాంగ్రెస్ సభ్యులు నినాదాలతో సభను హోరెత్తిస్తున్నారు. కోటి ఎకరాలకు సాగు నీరు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని గవర్నర్ అన్నారు. తెలంగాణ శాసనసభలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa