హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో గవర్నర్ నరసింహన్ ప్రసంగం ముగిసింది. తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ సభ్యుల ఆందోళన మధ్య గవర్నర్ నరసింహన్ ప్రసంగం కొనసాగింది. ఉభయ సభలనుద్దేశించి మాట్లాడుతున్న గవర్నర్ ప్రసంగాన్ని కాంగ్రెస్ నేతలు అడ్డుకునేందుకు యత్నించారు. సభలో కాంగ్రెస్ నేతలు ప్ల కార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. రైతు ఆత్మహత్యలపై సభలో కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు.అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ సభ్యులు నినాదాలతో సభను హోరెత్తిస్తున్నారు. కాగితాలు చింపి ఎగుర వేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కాంగ్రెస్ సభ్యుల ఆందోళనల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించి ముగించారు.జాతీయ గీతాలాపన అనంతరం గవర్నర్ సభనుంచి నిష్క్రమించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa