హైదరాబాద్: బలహీన వర్గాల ప్రతినిధి అయిన స్వామిగౌడ్పై శాసనసభలో కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దాడి చేయడం దుర్మార్గమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చట్టపరంగా కాంగ్రెస్ సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు గుండాల్లాగా ప్రవర్తించారని విమర్శించారు. ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారమే చట్టసభలో కాంగ్రెస్ సభ్యులు దాడి చేశారన్నారు. ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న పథకాలను చూసి కాంగ్రెస్ నేతలకు అసహనం పెరుగుతోందని విమర్శించారు. అత్యున్నత సభకు ఒకేసారి ఇద్దరు బీసీలను పంపడం ముఖ్యమంత్రి కేసీఆర్కే సాధ్యమైందని తలసాని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa