హైదరాబాద్: మద్యం తాగి అసెంబ్లీకి వచ్చారన్న ఆరోపణలు సభకే అవమానమని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు అసెంబ్లీకి తాగి వచ్చారని ప్రభుత్వ విప్ పల్లారెడ్డి చేసిన ఆరోపణలను ఆయన తప్పు పట్టారు. అసెంబ్లీలో గవర్నర్పై పేపర్లు, మైక్లు విసిరిన ఘటనలు కొత్తవికావని ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్లోనూ పేపర్లు విసిరిన ఘటనలు ఎన్నో జరిగాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. హామీల అంశాలు గవర్నర్ ప్రసంగంలో లేకపోవడంతోనే తాము నిరసన చేశామని అన్నారు. మార్షల్స్ బలవంతంగా తోసినప్పుడు కాంగ్రెస్ సభ్యులు పేపర్లు విసిరారని, మార్షల్స్ తోపులాటలో నా టేబుల్లో పక్కకు జరగడంతో వెనక కూర్చున్నానని జానారెడ్డి వివరణ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa