ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోమటిరెడ్డి సోదరులు సహా పలువురిపై వేటు?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 13, 2018, 10:16 AM

హైదరాబాద్ : అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ మధుసూదనాచారితో మంత్రులు సమావేశమయ్యారు. కాంగ్రెస్ సభ్యులపై చర్యల విషయమై ఈ సమావేశంలో చర్చించారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై హెడ్‌ఫోన్ విసిరిన ఘటనపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ సభ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. హెడ్‌ఫోన్ విసిరిన ఘటనపై సభలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. నిన్న జరిగిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలను మంత్రి హరీష్‌రావు, ఏజీ ప్రకాశ్‌రెడ్డి పరిశీలించారు. నిన్నటి ఘటనలో క్రియాశీలకంగా వ్యవహరించిన సభ్యులను గుర్తించారు. కోమటిరెడ్డి సోదరులు, సంపత్ కుమార్, రామ్మోహన్‌రెడ్డిని సభ పదవీ కాలం ముగిసే వరకు సస్పెండ్ చేసే యోచనలో అధికారపక్షం ఉన్నట్లు సమాచారం. మరికొందరు కాంగ్రెస్ సభ్యులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు బాధ్యులపై చర్యల కోసం సభాపతిని అధికార పక్షం కోరింది. బాధ్యులపై చర్యల విషయమై స్పీకర్ సభలో ప్రకటించే అవకాశం ఉంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa