ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని కోసం అత్యాధునిక విమానాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 13, 2018, 10:17 AM

 భారత రాష్ట్రపతి, ప్రధానిలకు ఇక కొత్త విమానాలు అందుబాటులోకి రానున్నాయి. అత్యుధానిక సదుపాయాలతో ఆ విమానాలను రూపొందిస్తున్నారు. 2020లోగా ఎయిర్ ఇండియా వన్ విమానాలు సర్వీస్‌లోకి వస్తాయి. దీని కోసం బోయింగ్ 777 విమానాలకు అప్‌గ్రేడ్ చేస్తున్నారు. భారత ఉప రాష్ట్రపతికి కూడా మరో ఆధునిక విమానం అందుబాటులోకి రానున్నది. ఈ ఏడాది ఆరంభంలోనే మూడు బోయింగ్ 777లను కొనుగోలు చేశారు. ఆ విమానాలకు కొత్త ఫీచర్లను ఏర్పాటు చేస్తున్నారు. సెక్యూర్టీ సిస్టమ్‌లను మరింత పకడ్బందీగా మారుస్తున్నారు. రెండు బోయింగ్‌లకు మాత్రం వీఐపీ ఎన్‌క్లోజర్‌ను, ప్రెస్ కాన్ఫరెన్స్ రూమ్, మెడికల్ ఎమర్జెన్సీ యూనిట్‌ను తయారు చేస్తున్నారు. ఈ విమానాల్లో వైఫైని కూడా అమరుస్తున్నారు. యాంటీ మిస్సైల్ సిస్టమ్స్, రాడార్ మెకానిక్స్, ఇతర సెక్యూర్టీ ఫీచర్స్ కూడా ఉంటాయి. 


ఇప్పటి వరకు రాష్ట్రపతి, ప్రధాని కోసం బోయింగ్ 747ఎస్ విమానాలను వాడారు. 777 వల్ల వీవీఐపీ ట్రాన్స్‌పోర్ట్‌లో చాలా మార్పు వస్తుంది. ఈ ప్లేన్‌తో నాన్‌స్టాప్‌గా అమెరికా వరకు వెళ్లవచ్చు. అంటే దారిలో రీఫుయలింగ్ ఇక అవసరం ఉండదు. కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా అత్యాధునికంగా ఉంటుంది. వీవీఐపీలకు పరన్సల్ రూమ్‌లు కూడా ఉంటాయి. ఈ విమానాలకు రెండు జీఈ90-115బీఎల్ ఇంజిన్లు ఉంటాయి. ప్రస్తుతం ఈ ఇంజిన్లే విమానాలకు అత్యంత శక్తివంతమైనవని భావిస్తున్నారు. త్వరలోనే ఎయిర్ ఇండియా నుంచి ఈ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa